ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం: సీఎం కేసీఆర్
కర్ణాటకలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో 8 మంది హైదరాబాదీలు చనిపోయారు. ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రమాదం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావుకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 8 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. దీంతో విషాద వదనం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీ లారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లో బస్సుకు మంటలు అవటుకుని తీవ్రరూపం దాల్చాయి.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications