దివాళి తర్వాత హస్తినకు కేసీఆర్: అక్కడే మకాం, ఎందుకంటే
బీఆర్ఎస్పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మకాం వేసి.. తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి హస్తినబాట పట్టనున్నారు. దీపావళి తర్వాత ఆయన ఢిల్లీ వెళతారని తెలిసింది.అక్కడే ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశం అవుతారట.
దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను కేసీఆర్ మీట్ అవుతారట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలపై అధికారులతో భేటీ అవుతారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచాలని కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేస్తారు. ఇప్పటికే కొన్ని పార్టీలు బీఆర్ఎస్లో విలీనానికి ఇంట్రెస్ట్ చూపించాయి. మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీయేత పార్టీ దేశంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ మేరకు జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
కేసీఆర్కు చిన్న చితక పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మేమున్నాం అంటున్నాయి. ఇప్పటివరకు అయితే అంతా పాజిటివ్గా వెళుతుంది. దానిని మరింత పటిష్టం చేసేందుకు వ్యుహరచన చేస్తున్నారు.