Hyderabad DKZ: 30 వేల మందిని మోసం చేసి రూ.700 కోట్లు కొల్లగొట్టిన డీకేజడ్ కంపెనీ..
చాలా మంది అత్యాశతో మోసపోతారు. తాజాగా ఇలానే ఓ సంస్థ అధిక వడ్డీ ఇస్తామని మోసం చేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
డీకేజీ (DKZ) టెక్నాలజీస్ అనే కంపెనీ ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన 30,000 మందికి పైగా పెట్టుబడిదారులు రూ.700 కోట్లు నష్టపోయారు. ఈ నెలలో మాదాపూర్లోని కంపెనీ కార్యాలయాన్ని మూసివేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
కంపెనీ తమ పెట్టుబడిపై 8, 12 శాతం మధ్య వడ్డీ ఇస్తామని వాగ్దానం చేసిందని బాధితులు చెప్పారు. దీంతో చాలా మంది బాధితులు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కంపెనీ మొదటగా వడ్డీని సరిగానే చెల్లింది. దీంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. జూన్ 2024లో పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయడం మానేసింది. దీంతో బాధితులు కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. కొంతమంది వ్యక్తులు 2018 నుంచి డబ్బును పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కంపెనీపై IPC 403, 406, 420 r/w 120-B సెక్షన్ల కింద (200/2024) కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసు ఫైల్ను హైదరాబాద్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ జహంగీర్ యాదవ్కు అప్పగించారు. ఈ మోసంలో అనేక మంది ఉద్యోగులు, ఏజెంట్లు ప్రజలతో మమేకమయ్యారని బాధితులు పేర్కొన్నారు.
A massive ₹700 cr scam by #DKZ Technologies has been exposed in Madhapur, #Hyderabad. Victims allege the company promised high returns but failed to deliver. They protested at the Hyderabad #CCS office, claiming no police action even after 15 days. pic.twitter.com/ba3420ctf6
— shinenewshyd (@shinenewshyd) September 14, 2024
ఏజెంట్లను నమ్మి తాము కష్టపడి సంపాదించిన డబ్బును, జీవితకాల పొదుపును పెట్టామని పెట్టుబడిదారులు తెలిపారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కంపెనీ పనితీరుపై తమకు నమ్మకం కలిగించారని వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని, తమ సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని కోరారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications