Hyderabad: హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లలో ఆందోళనకర పరిస్థితులు..!
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హాస్టళ్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోనే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం, బుధవారం కూడా పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారలు ఆగస్ట్ 12న బేగంపేటలోని 5 స్టార్ రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు. పలు అంశాలను గమనించారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సువాసన కోసం అసురక్షిత కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్యాంట్రీలో పాడైపోయిన కూరగాయలను చూసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయిన్లు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో నీరు నిలిచిపోవడంతో రెస్టారెంట్ల యాజమాన్యాన్ని ప్రశ్నంచారు. వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నట్లు కనిపించింది. బ్రెడ్ తయారు చేసి కోల్డ్ స్టోరేజీలో ఉంచగా ఎలాంటి కవర్ లేకుండా కనిపించిందని అధికారులు తెలిపారు. 5-నక్షత్రాల హైదరాబాద్ రెస్టారెంట్ వారి RO ప్లాంట్ కోసం నీటి విశ్లేషణ నివేదికలను అందించడంలో విఫలమైయ్యాయని పేర్కొన్నారు.

బేగంపేటలో కొత్త ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకంతో సహా వివిధ అపరిశుభ్రమైన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
బార్ అండ్ రెస్టారెంట్ టగదిలో పురుగులను నిరోధించే వలలు లేవని చెప్పారు. బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. రెస్టారెంట్ ప్రాంగణంలో FSSAI లైసెన్స్ కాపీని ప్రదర్శించలేదని గుర్తించారు. అయితే ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్నెస్, పెస్ట్ కంట్రోల్ సర్టిఫికేట్లను కూడా నిర్వాహకులు నిర్వహించలేదని తెలుస్తోంది.
హైదరాబాద్ బౌల్ ఓ చైనాలోని ప్రముఖ చైనీస్ రెస్టారెంట్ కూడా అనేక పరిశుభ్రత నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. నిల్వ చేసే ప్రదేశంలో ఎలుకల మలం కనిపించిందని పేర్కొన్నారు. కిచెన్ ఫ్లోరింగ్ అతుక్కొని, శుభ్రపరిచే ప్రదేశానికి సమీపంలో నీరు నిలిచిపోయింది. రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన ఆహార పదార్థాలు సరిగా లేనట్లు గుర్తించారు. హైదరాబాద్ అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కాపీని అందించడంలో, ప్రదర్శించడంలో కూడా రెస్టారెంట్ యాజమాన్యం విఫలమైంది.












Click it and Unblock the Notifications