Free Bus: మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. మెట్రోలో తగ్గిన రద్దీ..
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, శనివారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణకు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు అందరూ రాష్ట్రవ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేసింది.
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రోల్లో రద్దీ తగ్గింది. శనివారం కాబట్టి సాధారణంగా రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక ఫ్రీ బస్ తో మెట్రోలో మహిళలు కనిపించడం లేదు. అటు హైదరాబాద్ లోని ఆటోవాలాలు కూడా ఉచిత బస్ తో తమకు దెబ్బేనని చెబుతున్నారు. తమ ఆటోల్లో ఎక్కువగా మహిళలు ప్రయాణిస్తారని.. ఉచిత బస్ తో వారంతా బస్ ఎక్కుతారని చెబుతున్నారు.

అయితే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో అమల్లో ఉంది. తాజాగా తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. అటు మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications