GHMC: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ సరికొత్త రికార్డ్, ఛార్మినార్ జోన్ అత్యల్పం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం పెట్టుకున్న లక్ష్యంతో ఏకంగా 85 శాతం పన్నులు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. దీంతో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1500 కోట్లకుపైగా ఆస్తి పన్ను వసూలైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1601.03 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఈ సంవత్సరం చాలా మంది ఆస్తి యజమానులు ఆన్లైన్లో పన్ను చెల్లించడంతో 13,53,264 అసెస్మెంట్ల నుంచి వచ్చిన మొత్తం పన్నులో, 7,73,098 మంది ఆస్తి యజమానులు ఆన్లైన్లో పన్ను చెల్లించగా, 1,31,603 మంది మీ సేవ ద్వారా చెల్లించారు.
కార్పొరేషన్ డేటా ప్రకారం.. బిల్ కలెక్టర్లు 3,05,509 నుంచి పన్నును తీసుకోగా, 1,43,054 మంది వ్యక్తులు జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాలను సందర్శించి చెల్లించారు. మరింత ఆదాయాన్ని సంపాదించడానికి, పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ సేవా కేంద్రాలను శుక్రవారం రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచారు.

జీహెచ్ఎంసీ పెట్టుకున్న లక్ష్యం రూ.2 వేల కోట్లు కాగా.. 84.09 శాతం వసూలైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్లో రూ.585 కోట్లు లక్ష్యం గా పెట్టుకోగా.. రూ.435.57 కోట్లు వసూలయ్యాయి. అత్యల్పంగా ఛార్మినార్ జోన్లో రూ.172 కోట్ల లక్ష్యం పెట్టుకోగా.. రూ.122.86 కోట్లు వసూలు అయ్యాయి. శేరిలింగంపల్లి జోన్లో రూ.393 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.348.60 కోట్ల పన్ను వసూలైంది.
ఎల్బీనగర్ జోన్లో రూ.262 కోట్లు లక్ష్యం గా పెట్టుకోగా.. రూ.259.06 కోట్లు వసూలయ్యాయి. కూకట్పల్లి జోన్లో రూ.295 కోట్ల లక్ష్యం పెట్టుకోగా.. రూ.282.18 కోట్లు, సికింద్రాబాద్ జోన్లో రూ.293 కోట్లు లక్ష్యం గా
పెట్టుకోగా.. రూ.233.44 కోట్ల పన్ను వసూలైంది.
జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ పథకం కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.742.41 కోట్లు వసూలు చేసి ఖజానాను చేరడంతో.. ఆస్తిపన్ను రూ.1601.03 కోట్లకు చేరుకుంది. 47,205 అసెస్మెంట్ల ద్వారా రూ. 92.78 కోట్ల మొత్తం సేకరించారు. జూలైలో ప్రవేశపెట్టిన వన్-టైమ్ స్కీమ్ (OTS) ద్వారా రూ. 1601.03 కోట్ల ఆదాయంలో ఈ ఆదాయం ఒక భాగం.
ఆస్తి పన్నుపై 90 శాతం పేరుకుపోయిన బకాయి వడ్డీని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆస్తిపన్ను బకాయిలతో ఇబ్బందులు పడుతున్న వారికి OTS ఉపశమనం కలిగించింది. ఈ పథకాన్ని పొందడం ద్వారా, పన్ను చెల్లింపుదారులు 2021-22 వరకు పన్ను బకాయిల అసలు మొత్తాన్ని, 10 శాతం కూడబెట్టిన వడ్డీతో పాటు ఒకేసారి క్లియర్ చేయాల్సి ఉంటుంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications