సిటీలో దంచికొట్టిన వాన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం పూట భారీ వాన పడటంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

గత పది, పదిహేనురోజుల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు నిండుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ముసురు వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి.. రైతులు కూడా పనిచేసుకోలేని సిచుయేషన్ ఏర్పడింది. ఇప్పటికే నారు కొందరికీ నష్టం చేకూర్చగా.. మరికొందరు మళ్లీ కూడా వేశారు.
ఇటు ఆంధ్రప్రదేశ్లో వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications