Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు.. అనుభవం పరిగణలోకి తీసుకోలే.. మోత్కుపల్లి

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు లేకున్నా వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు అధికార పార్టీలోకి వలసలు ఉండేవి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లోకి కూడా ఉన్నాయి. అయితే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడారు. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నర్సింహులు.. ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించారు.

రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరానని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేకపోయారని వివరించారు. అందుకే తాను చాలా బాధపడుతున్నానని లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు. పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదన్నారు.

how etela rajender come to bjp:motkupally narshimlu

Recommended Video

    Motkupalli Narasimhulu On KCR దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదు | Oneindia Telugu

    అనుభవాన్ని పరిగణలోకి తీసుకోని అవకాశం కల్పించడంలో పార్టీ విఫలమైందన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక ఈటల రాజేందర్ పార్టీలోకి తీసుకునే సమయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదని. దళితుల భూములు ఆక్రమించిన ఈటల రాజేందర్ పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు.

    ఈటల రాజేందర్ ఎస్సీల భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నందుకు కనీసం వివరణ కూడా తీసుకోకుండా పార్టీలో చేర్చకున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే తనను దూరం పెట్టడం బాధకరమన్నారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+