వర్ష బీభత్సం కంటిన్యూ: 35 మంది మృతి, 2 రోజులు ఇళ్లలోనే ఉండండి: కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపి 35 మంది వరకు చనిపోయారు. వర్ష ప్రభావం హైదరాబాద్పై ఎక్కువగా చూపుతోంది. వర్షపునీరు రహదారులపైకి నిలిచిపోవడంతో.. జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.

వరద పోటెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. కార్లు, టూ వీలర్స్ మెల్లగా జరిగాయి. ఒక్క హైదరాబాద్లోనే 19 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో 10 మంది వరకు చనిపోయారు. హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వారికి తగిన సూచనలు చేశారు.
Telangana: MoS Home G Kishan Reddy visited rain-affected areas in Hyderabad today.
— ANI (@ANI) October 14, 2020
He says, "Appeal to people to remain indoors for the next 1-2 days, due to heavy rainfall. National Disaster Response Force and Army teams are conducting rescue operations." pic.twitter.com/g1iqb1ZSXo
Recommended Video
మరో రెండు రోజులు ఇళ్లలో ఉండాలని ప్రజలను కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటు మహారాష్ట్రలో వర్షం జోరందుకుంది. ముంబై, పుణెలో వర్షపునీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications