ఆసుపత్రిలో రచ్చరచ్చ.. ఫర్నీచర్ ధ్వంసం.. అడ్డొచ్చిన పోలీసులపై దాడి
హైదరాబాద్ : డాక్టర్లు నిర్లక్ష్యంగా వహించారంటూ పేషెంట్ బంధువులు విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రిలో నానా హంగామా చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడమే గాకుండా అడ్డొచ్చిన పోలీసులపై దాడికి దిగారు. నానా బూతులు తిడుతూ నోటికి పనిచెప్పారు. మీకు ఇక్కడేం పనంటూ ఖాకీలపైకి రెచ్చిపోయారు. సీఐని నెట్టివేస్తూ అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశారు.
లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. పోలీసులను నెట్టివేస్తూ నానామాటలు తిడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. షమీమ్ బేగం అనే మహిళ గుండెనొప్పితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతిచెందారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే షమీమ్ బేగం చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలోని ఫర్నీచర్, కంప్యూటర్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై జులుం చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీయడమే గాకుండా చేయిచేసుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications