ఆసుపత్రిలో రచ్చరచ్చ.. ఫర్నీచర్ ధ్వంసం.. అడ్డొచ్చిన పోలీసులపై దాడి
హైదరాబాద్ : డాక్టర్లు నిర్లక్ష్యంగా వహించారంటూ పేషెంట్ బంధువులు విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రిలో నానా హంగామా చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడమే గాకుండా అడ్డొచ్చిన పోలీసులపై దాడికి దిగారు. నానా బూతులు తిడుతూ నోటికి పనిచెప్పారు. మీకు ఇక్కడేం పనంటూ ఖాకీలపైకి రెచ్చిపోయారు. సీఐని నెట్టివేస్తూ అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశారు.
లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. పోలీసులను నెట్టివేస్తూ నానామాటలు తిడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. షమీమ్ బేగం అనే మహిళ గుండెనొప్పితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతిచెందారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే షమీమ్ బేగం చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలోని ఫర్నీచర్, కంప్యూటర్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై జులుం చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీయడమే గాకుండా చేయిచేసుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications