Indiradevi: మహా ప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు..
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబసభ్యులు, పలువురు సినీ తారలు పాల్గొని ఇందిరాదేవికి వీడ్కోలు పలికారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉదయం 4 గంటలకు
బుధవారం ఉదయం 4 గంటలకు ఆమె పరిస్థితి విషమించటంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శన కోసం ఇందిరాదేవి పార్థివదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఇందిరాదేవి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రముఖుల నివాళులు
హీరో మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, గోపి చందు, విష్ణు డైరెక్టర్లు త్రివిక్రం, కొరటాల శివ, సుకుమార్, నిర్మాత అశ్వినీదత్ ఇందిర పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కృష్ణ, మహేష్ బాబును కలిసి ధైర్యం చెప్పారు.

ఐదుగురు సంతానం
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని.. కాగా.. కొద్ది రోజల క్రితం మహేష్ సోదరుడు రమేష్ బాబు చనిపోయారు. కృష్ణ-ఇందిరాదేవికి 1961 వివాహం జరిగింది. కృష్ణ 1992లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications