హైదరాబాద్కు జయరాం హత్య కేసు నిందితులు: శిఖాచౌదరితో సంబంధంపై పనిమనిషి నుంచి ఆరా!
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లని నందిగామ నుండి పిటి వారెంట్ పైన హైదరాబాద్కు తరలించారు. ఏపీ నుంచి తీసుకు వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు
నాంపల్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
రేపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ల కస్టడీ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశముంది.

ఇదిలా ఉండగా, జయరాం హత్య కేసులో శిఖాచౌదరి పని మనిషి, వాచ్మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారని తెలుస్తోంది. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లుగా చెబుతున్నారు. ఓ రహస్య ప్రాంతంలో వీరిని పోలీసులు విచారించారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications