KTR: సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. అందులో ఏముందంటే..!
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు సంబంధించి ఓ వీడియో ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు.. అందులో ప్రదేశానికి ఎప్పుడు వెళ్లాల అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం వీడియో పోస్ట్ చేశారంటే.. జలవహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్క్ కు సంబంధించిన వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే.. సిటీకి మరో అట్రాక్షన్ జోన్ గా మారనుంది.
ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ భారీగా పర్యటకులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఒకవైపు సెక్రటేరియట్, అమరవీరుల స్థాపం ఉంది. అలాగే అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, లుంబీని పార్క్ ఉంటాయి. వీటితో పాటు జలవిహార్ పక్కన పార్క్ అందుబాటులోకి వస్తే పర్యటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ హైదరాబాద్ కు కొత్త ఆందమని కేటీఆర్ అన్నారు. ఈ పార్క్ తో సెంట్రల్ హైదరాబాద్ మరింత కల సంతరించుకుంటుందన్నారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. దీన్ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలో ఈ పార్కును ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. మీరందరూ అందమైన బోర్డు వాక్ ను సందర్శించి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పార్కును హెచ్ఎండీఏ సుమార్ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
A brand new addition to central Hyderabad around the famous Hussain Sagar Lake 😊@HMDA_Gov has developed this beautiful Lake Front Park next to Jalavihar in about 10 acres
— KTR (@KTRBRS) September 19, 2023
Will be inaugurating the park in a few days. Hope you all will visit and enjoy the beautiful Boardwalk pic.twitter.com/PwCpzsmbjD
ఈ పార్కులో అండర్పాస్లతో కూడిన ఎత్తైన నడక మార్గాలు, కాలినడక దారులు, సీటింగ్తో కూడిన వాటర్ ఛానల్ డెక్, హుస్సేన్ సాగర్పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్లు కూడా ఉన్నాయి. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పార్కులో పిల్లల కోసం ఆట స్థలం, సీటింగ్తో కూడిన పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్ ఈ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications