క్రెడిబిలిటీ కోల్పోవద్దు.. రాజీనామా చేయ్, డీజీపీకి అర్వింద్ సవాల్
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శల పరంపర కొనసాగుతోంది. ఇవాళ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేసులు పెట్టమంటే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ఎఫ్ఐఆర్ అతిగా ఉందని కోర్టు కూడా తప్పుపట్టిందని, అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దని అన్నారు. చిత్తశుద్ధి ఉన్నట్టైతే కేసులు పెట్టాలని కేసీఆర్ చెబితే రాజీనామా ఆయన మొహాన కొట్టి బీజేపీలోకి రావాలని డీజీపీని ఉద్దేశించి అరవింద్ అన్నారు.

టికెట్ ఇస్తాం..
అంతేకాదు బీజేపీ మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తుందని తెలిపారు. టికెట్ కూడా ఇస్తుందని ఆయన హామీనిచ్చారు. ఏడాదిన్నరలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుందని చెప్పారు. మహిళా టీచర్ చనిపోతే చూడటానికి కూడా రాని కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవీ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కవితది కాదని అన్నారు.

టీఆర్ఎస్ తొత్తు..
డీజీపీ మహేందర్రెడ్డి టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని అర్వింద్ ఆరోపణలు చేశారు. మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనం అవుతోందని కామెంట్ చేశా రు. సీఎం కేసీఆర్కు మహేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాగుబోతు ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులు అని అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ పరామర్శించారు.
Recommended Video

టెన్త్ నుంచే మెరిట్ స్టూడెంట్
సరస్వతి టెన్త్ నుంచే మెరిట్ స్టూడెంట్ అని.. ఆమెకు ఆనాడే తాము ఉన్నత విద్య కోసం సాయం చేశామని చెప్పారు. ఇక్కడ ఆమె టీచర్గా పనిచేస్తుంటే.. భర్త ఖతార్లో డ్రైవర్గా పని చేసి డబ్బులు పంపుతున్నారని వివరించారు.. గాడిన పడుతున్న మధ్య తరగతి కుటుంబాన్ని బదిలీ పేరుతో ఛిన్నాభిన్నం చేశారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications