మహిళలపై దాడుల్ని సమూలంగా నిర్మూలించాలి : ఎంపీ కవిత
హైదరాబాద్ : మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ.. మహిళలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్డీకాపూల్ లో మహిళా భద్రతా విభాగం నూతన భవనం ప్రారంభోత్సవానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచిపేరు వచ్చిందని అన్నారు కవిత. నేరాలు తగ్గుముఖం పట్టడానికి అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ దేశంలోనే ముందు వరుసలో నిలిచారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాదు మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యాప్ లు కూడా తెరపైకి తెచ్చినట్లు వివరించారు.

మహిళలపై దాడులకు తెగబడుతున్న నిందితులకు తగిన శిక్ష పడేలా వుమెన్ వింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కవిత. మహిళలకు అండగా నిలబడేందుకు.. ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా 100 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం తీసుకొచ్చిన హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications