VIRAL PIC:20 ఏళ్ల క్రితం, ఇప్పుడు.. మంత్రి కేటీఆర్ ట్వీట్, కామెంట్ల వరద
మంత్రి కేటీఆర్.. ప్రభుత్వంలో పదవీ, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ విధులు.. నిన్ననే మునుగోడులో తమ పార్టీ విజయం సాధించింది. అయితే ఎంత బిజీగా ఉన్న ట్విట్టర్లో మంత్రి యాక్టివ్గానే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఇష్యూపై స్పందిస్తూనే. పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా తన ఫోటోను పోస్ట్ చేశారు. 20 ఏళ్ల క్రితం నాటి ఫోటో.. ఇప్పటి ఫోటోను కలిపి మరీ పోస్ట్ చేశారు. దానికి 20 ఇయర్స్ ఎగో అండ్ నౌ, థ్రో బ్యాక్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ట్విట్టర్లో కామెంట్ల వరద పారుతోంది. ఒక్కొకక్కరు ఒకలా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
వావ్.. సూపర్..
చాలామంది వావ్ సూపర్ అని అంటున్నారు. ఏం మారలేదు అని కామెంట్ చేస్తున్నారు. సూపర్ రామన్న.. జయహో రామన్న అని రాస్తున్నారు. అంతగా ఏమీ మారలేదు అని ఒకరు రాశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నావని.. అందుకే వయస్సు పెరగడం లేదెమో అని ఒకరు రాశారు. దానికి చాలా మంది యస్ అంటూ కామెంట్ చేశారు.

స్మాల్ ఛేంజెస్
స్మాల్ చేంజేస్ అని ఒకరు రాశారు. హెయిర్ కలర్ మారిందని అంటున్నారు. పిక్స్ బాగున్నాయని మరొకరు రాశారు. జయహో రామన్న అని.. బాస్ అని రాస్తున్నారు. లుకింగ్ మోర్ ఎనర్జిటిక్ అని రాశారు. అమేజింగ్ బ్రదర్.. ఏమీ మారలేదని రాశారు. మొహం, హావభావాలు ఏమీ మారలేదని ఒకరు రాశారు. హెయిర్ కలర్ మారిందని.. ఇద్దరు, ముగ్గురు కామెంట్ చేశారు. ఇప్పటికీ చాలా స్మార్ట్ అని రాశారు. నమస్తే సర్.. అంటూ కామెంట్ సెక్షన్ నిండిపోయింది.

ధరణి ఇష్యూ
ఒకరెమో.. ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చాలని సజెస్ట్ చేశారు. కేటీఆర్ టీఆర్ఎస్కి బదులు కేటీఆర్ బీఆర్ఎస్ మార్చాలని కోరారు. అయితే విచిత్రంగా ఒకరు ప్రజా సమస్యలపై రియాక్ట్ అయ్యారు. ధరణి పోల్టర్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ధరణి పోర్టల్ వల్ల భూముల రిజిష్ట్రేషన్లో సమస్యలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. సో.. కేటీఆర్ చేసిన ట్వీట్.. అన్నీ వర్గాలు స్పందించాయి. పనిలో పనిగా ధరణి ఫోర్టల్ గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications