Hyderabad: 46 కిలోల గంజాయితో పట్టుబడిన మహిళ..
తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ భారీస్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కోటి రూపాయల విలువైన హెరాయిన్, ఎండీఎంఏను పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన నరేంద్ర బిష్ణోయ్ , ప్రవీణ్ బిష్ణోయ్ , హేమరామ్ మీర్పేటలోని ప్రశాంతి హిల్స్ లో నివసిస్తున్నారు.
వారంతా స్టీల్ రెయిలింగ్ వర్క్ చేస్తుంటారు. మీర్ పేటలోనే ఉండే రాజస్థాన్ కు చెందిన వ్యాపారి పక్కరమ్ దేవసి హార్డ్ వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. వీరు నలుగురు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. రాజస్థాన్ లో తక్కువ రేటుకు దొరికే డ్రగ్స్ కొని సిటీలో సప్లయ్ చేయడం ప్రారంభించారు. రాజస్థాన్ లోని పెడ్లర్ల వద్ద గ్రామ్ హెరాయిన్ రూ.5 వేలకు, ఎండీఎంఏ రూ.4 వేలకు కొని ఎల్బీ నగర్, మీర్పేట పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారు. హెరాయిన్ రూ.10 వేలు అమ్మవారు.

పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి నరేంద్ర, ప్రవీణ్, హేమరామ్ను అరెస్ట్ చేసి వారి నుంచి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండీఎంఏను పట్టుకున్నారు. అంతకు ముందు బుధవారం నాడు ఒడిశా నుండి మహారాష్ట్రకు రైలులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న మహిళను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్)తో కలిసి ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్పి) సికిదరాబాద్లో పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.11.5 లక్షల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
నిందితురాలు శిల్పా నాయక్ (27) ఒడిశాలోని గజపతి జిల్లా నివాసిగా గుర్తించారు. ఆమెకు సహకరించిన రాజీవ్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. సింగిల్ పేరెంట్ అయిన శిల్ప తన ఆరేళ్ల కొడుకును, వృద్ధ తల్లిదండ్రులను చూసుకుంటుందని పోలీసులు తెలిపారు. 2018లో భర్త చనిపోవడంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇంతలో, సులభంగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రారంభించమని రాజీవ్ ఆమెను ప్రలోభపెట్టాడని తెలిపారు.
ముంబైలో గంజాయికి డిమాండ్ ఉందని, ఒడిశాలోని అటవీ ప్రాంతం నుండి ముంబైకి దానిని అక్రమంగా రవాణా చేయగలిగితే త్వరగా డబ్బు సంపాదిస్తారని రాజీవ్ శిల్పాకు చెప్పాడని వివరించారు. దీంతో వీరిద్దరూ పథకం వేసుకుని జనవరి 16న 46 కిలోల గంజాయిని కొనుగోలు చేసేందుకు మోహన అటవీ ప్రాంతానికి వెళ్లారు. నాలుగు లగేజీ బ్యాగుల్లో గంజాయి సర్దుకున్నారు. అదే రోజు ఇద్దరూ పలాస రైల్వే స్టేషన్కు వెళ్లి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలును బుక్ చేసుకున్నారు. వారు సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో జనవరి 17న ముంబైకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.
సాధారణ తనిఖీల్లో పోలీసులకు అనుమానం వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్ 5లో శిల్పా నాయక్ను పట్టుకున్న నిషిద్ధ వస్తువును కనుగొన్నారు. రాజీవ్ కుమార్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications