'శిఖాచౌదరి పాత్ర ఉన్నట్లు తేలలేదు, జయరాంను హత్య చేసి రాకేష్ రెడ్డి వీడియో తీశాడు'
హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో పోలీసులు ముగ్గురిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విశాల్, నగేశ్, సుభాష్ చంద్రారెడ్డిని అరెస్ట్, చేసి మీడియా ముందుకు తీసుకు వచ్చారు. జయరాం హత్య గురించి డీసీపీ మాట్లాడారు. ప్లాన్ ప్రకారమే జరిగిందని, ఈ కేసులో పలు కోణాలున్నాయన్నారు.
ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం ఎస్సై రాంబాబుతో సహా అయిదుగురు పోలీసు అధికారులను విచారించామని చెప్పారు. హత్యలో తమ ప్రమేయం లేదని పోలీసు అధికారులు చెప్పారన్నారు. అయినప్పటికీ వారిని ప్రశ్నిస్తామని చెప్పారు. జయరాం ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లిందనే ఫిర్యాదుపై శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామన్నారు.
ఈ హత్యలో శిఖాచౌదరి పాత్ర ఉన్నట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలలేదని స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి ఆమెను విచారిస్తామన్నారు. జయరాంకు నాలుగున్నర కోట్ల రూపాయలు రాకేష్ రెడ్డి అప్పుగా ఇచ్చారని చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు. జయరాంను హత్య చేసే సమయంలో రాకేష్ రెడ్డి తన ఫోన్లో వీడియో తీశాడన్నారు. వాటిని కూడా సేకరించామన్నారు.

జయరాంను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత హత్య చేశారని విచారణలో తేలిందన్నారు. బెదిరించి కొట్టారని, ఆ తర్వాత హత్య చేశారని చెప్పారు. రాకేష్ రెడ్డికి డబ్బులు ఇచ్చేందుకు జయరాం దాదాపు పది మందికి ఫోన్లు చేశారని, చిత్రహింసలకు గురిచేసి ఖాళీ బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్నారు.
రాకేష్ రెడ్డిని విచారించామని, శిఖా చౌదరి పాత్ర గురించి చెప్పలేదని తెలిపారు. విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆమె పాత్రపై చెబుతామని అన్నారు. శిఖాచౌదరికి సంబంధించి రాకేష్ రెడ్డికి ఇవ్వాల్సిన ఒకటిన్నర కోట్ల రూపాయలు డబ్బు చెల్లిస్తానని జయరాం ఒప్పుకున్నారన్నారు. ఈ హత్య జరిగినట్లు శిఖా స్నేహితుడు సంతోష్ ఆమెకు ఫోన్ ద్వారా తెలిపాడన్నారు.
-
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..! -
సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక.. -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!! -
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే ? -
దేశవ్యాప్తంగా "అన్నదానం".. "విరోష్" జంట బిగ్ డిసిషన్..! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
T20 World cup: విండీస్ పై ఆడే టీమిండియా ఇదే..! రింకూ సస్పెన్స్ కు తెర..! -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..!












Click it and Unblock the Notifications