సాయిరెడ్డి మెడలో కొండచిలువ, ఫోటోకు ఫోజులు, ట్వీట్
ఇటీవల పెట్స్ పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోతుంది. పెట్స్ అంటే ఏ కుక్క, పిల్లో కాదు.. కొండ చిలువలను కూడా సాకుతున్నారు. వాటితో ఏం చక్కా ఫోటోలు కూడా దిగుతున్నారు. విదేశాల్లో కాదు.. హైదరాబాద్ నడిబొడ్డున కొందరు సంపన్నులు పెంచుతున్నారు. శివారులో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కొండ చిలువలతో ఫోటోలు దిగారు.

ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అతను.. వాటితో ఫోటోలు కూడా దిగాడు. శంషాబాద్లో గల ఫామ్హౌస్లో ఓ తెల్ల కొండ చిలువను సాయిరెడ్డి మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఫోటోకు ఫోజు ఇచ్చాడు. తర్వాత మరిన్ని చిన్న కొండ చిలువను కూడా పట్టుకున్నాడు. వాటిని పట్టుకుని.. నవ్వుతూ కనిపించాడు.

ఓ పెద్ద సాలీడును కూడా తన చేతిపైకి ఎక్కించుకున్నాడు. ఫామ్ హౌస్లో రంగుల చిలుకలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలను ట్వీట్ చేశారు. జీవుల వైవిద్యభరిత సౌందర్యం ఆసక్తిగా గమనించడం తనకు వినోదం కలిగిస్తోందని తెలిపారు.ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే సాయిరెడ్డి.. శనివారం రోజున కాస్త రిలాక్ట్స్ అయ్యారు. పెట్ పైథాన్స్తో ఆడారు. ఆ ఫోటోలను పంచుకున్నారు. మీరు కూడా వాటిని చూసేయండి.

-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications