రాహుల్ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి, కాళ్లు పట్టుకొని.. పవర్ కట్, సభ రద్దు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ శివారులో కొనసాగుతోంది. పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాహుల్ గాంధీతో హైదరాబాద్ నగరంలో పాదయాత్రలో పాల్గొంటారు.
రాహుల్ పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజున భద్రతా లోపం కనిపించింది. పాలమాకుల వద్దకు రాహుల్ పాదయాత్ర రాగానే.. ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటి మరీ.. వచ్చేశారు. రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నాడు. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతనిని బలవంతంగా బయటకు లాగారు. పోలీసుల తీరుపై రాహుల్ ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశారు.

మరోవైపు ఇవాళ పెద్ద షాపూర్ వద్ద సభ జరగాల్సి ఉంది. అయితే యాత్ర కొనసాగే దారిలో పవర్ కట్ అయ్యింది. హైవే.. పరిసర ప్రాంతాలు చీకటిగా మారింది. దీంతో సభను రద్దు చేశారు.సభను ఆడ్డుకునేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. యాత్రకు వస్తోన్న స్పందనను చూసి.. ఓర్వడం లేదని అంటున్నారు.
రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది. ఇదివరకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉండేది. మోడీ సర్కార్.. ప్రధాని ఒక్కరికే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి చట్ట సవరణ చేసింది. దీంతో దేశంలో ప్రధాని ఒక్కరికే ప్రొటెక్షన్ ఉండనుంది. మిగతా వారికి.. స్థాయిని బట్టి ఎన్ఎస్జీ కమోండోలు ప్రొటెక్షన్ ఇస్తారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications