ఈ నెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ఎన్నికల తర్వాత అధికారంలోకి రెండో సారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఈ నెల 16న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకుని అదే రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అయితే ప్రొటెం స్పీకర్గా శాసన సభ సభ్యుల్లో సీనియర్ అయిన మజ్లిస్ పార్టీ అభ్యర్థి చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత 16వ తేదీన రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్గా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ మరుసటి రోజు అంటే 17వ తేదీన నూతన శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

అంతకుముందు అంటే జనవరి 17న ఉదయం 11:30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం అవుతుంది. ప్రజలు గొప్ప విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి అందించారని ఆ స్ఫూర్తితో మంచిరోజున శాసన సభ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. శాసనసభ కార్యకలాపాలు జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అదే రోజున స్పీకర్ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు ఉంటాయి.
జనవరి 18వ తేదీ రోజున స్పీకర్ ఎన్నిక, స్పీకర్ ఎన్నికైనట్లు ప్రకటన చేస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన స్పీకరును సీఎం కేసీఆర్, ప్రతిపక్షనేత స్పీకర్ స్థానంలో స్పీకరును కూర్చోబెడతారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షతన సభాకార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న గవర్నర్ నరసింహన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంతో తొలి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications