సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయం: తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 24 నుంచి 42కు పెంపు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులు ఉండగా, ఆ సంఖ్యను 42కు పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.
న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు చేరాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుంది. దీంతో వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇకపై తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు చేరనుంది. హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ కార్యాలయం వెల్లడించింది.
ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయిన విషయం తెలిసిందే. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, తాజాగా, జడ్జీల సంఖ్యను పెంచడం పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications