రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యూయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2022కు సంబంధించి ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. అయితే, ఈ రెండు విడతల కౌన్సెలింగ్లలో సీట్లు పొందని విద్యార్థల కోసం స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నవంబర్ 9 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్ బాబు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ నవంబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఉంటుందని తెలిపారు. నవంబర్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. నవంబర్ 15న సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు.

ఎంపికైన విద్యార్థులు సంబంధిత సెంటర్లలో నవంబర్ 15 నుంచి 19 వరకు నిర్వహించే వెరిఫికేషన్ ప్రక్రియలో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్న విద్యా మండలి ఈ మేరకు విడుదల చేసింది.
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఈసెట్ 2022లో సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతోంది. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications