11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు, ఇదీ కారణం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని అనుకుంటోంది. గీత దాటిన వారిపై చర్యలకు ఉప క్రమిస్తోంది. అయితే నిన్న హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇదీ కూడా జూమ్ మీటింగ్ ద్వారా జరిగింది. ఆ మీటింగ్కు దాదాపు 11 మంది అధికార ప్రతినిధులు హాజరుకాలేదు. దీనిపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

11 ప్రతినిధులు డుమ్మా..
సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరు కావడంతో.. 11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని అంతా భావించారు. భారీగా అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.

జగ్గారెడ్డి గైర్హాజరు
జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా హాజరుకాలేదని తెలిసింది. జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి హాజరుకాలేదు.ఇదేమైనా కంపెనీయా ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో చాలా మంది హాజరుకాలేదని తెలిసింది.

వివరణతో సంతృప్తి చెందితే..
కీలక సమావేశానికి డమ్మా కొట్టిన వారికి పీసీసీ నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని కోరింది. వివరణతో సంతృప్తితో చెందితే ఓకే.. లేదంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జగ్గారెడ్డి ఫైర్
అంతకుముందు గత నాలుగు నెలలుగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరపలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పు అని స్పష్టం చేశారు. పాదయాత్రలో వన్ మ్యాన్ షోలా? అంటూ రేవంత్ తీరును కూడా తప్పుపట్టారు. అందరినీ కలుపుకోని పోవాలని సూచించారు. ఈ క్రమంలోనే షోకాజు నోటీసు జారీచేసింది.
-
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications