11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు, ఇదీ కారణం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని అనుకుంటోంది. గీత దాటిన వారిపై చర్యలకు ఉప క్రమిస్తోంది. అయితే నిన్న హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇదీ కూడా జూమ్ మీటింగ్ ద్వారా జరిగింది. ఆ మీటింగ్కు దాదాపు 11 మంది అధికార ప్రతినిధులు హాజరుకాలేదు. దీనిపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

11 ప్రతినిధులు డుమ్మా..
సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరు కావడంతో.. 11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని అంతా భావించారు. భారీగా అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.

జగ్గారెడ్డి గైర్హాజరు
జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా హాజరుకాలేదని తెలిసింది. జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి హాజరుకాలేదు.ఇదేమైనా కంపెనీయా ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో చాలా మంది హాజరుకాలేదని తెలిసింది.

వివరణతో సంతృప్తి చెందితే..
కీలక సమావేశానికి డమ్మా కొట్టిన వారికి పీసీసీ నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని కోరింది. వివరణతో సంతృప్తితో చెందితే ఓకే.. లేదంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జగ్గారెడ్డి ఫైర్
అంతకుముందు గత నాలుగు నెలలుగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరపలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పు అని స్పష్టం చేశారు. పాదయాత్రలో వన్ మ్యాన్ షోలా? అంటూ రేవంత్ తీరును కూడా తప్పుపట్టారు. అందరినీ కలుపుకోని పోవాలని సూచించారు. ఈ క్రమంలోనే షోకాజు నోటీసు జారీచేసింది.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications