గ్రేట్: అండర్-19 జట్టుకు తెలుగుమ్మాయి ఎంపిక
తెలంగాణకు చెందిన అమ్మాయి త్రిష అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈమె స్వస్థలం భద్రాచలం. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు చోటు కల్పించారు.
త్రిష ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ప్రతిభ చాటింది. జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఎంపికైంది. 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై చక్కగా ప్లే చేసింది. చిన్న వయసులో బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.
త్రిష లెగ్ స్పిన్నర్. అలాగే బ్యాటింగ్లో చక్కగా ఆడుతుంది. పవర్ హిట్టింగ్తో రాణిస్తూ ఆల్ రౌండర్గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరుతో ఉందట.ఇప్పుడు అండర్ -19 నెక్ట్స్.. టీమిండియా ఉమెన్ జట్టులో స్థానం సంపాదించడమే. ఆ దిశగా కూడా అడుగులు వేస్తానని అంటోంది. ఆమె ప్రతిభను చూసినవారంతా.. కచ్చితంగా మహిళల జట్టులో ఆడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.