కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. : మంత్రి కేటీఆర్
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగి అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల బీమా సాయం అందించి, వారిలో మనో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.
తెలంగాణ భవన్కు వచ్చిన 80 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త, సోదరుడు, కుమారుడు.. వివిధ ప్రమాదాల్లో మరణించారని తెలిపారు. అలాంటి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆ కుటుంబాల స్థితిగతులను పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేదు అని కొంతమంది.. పిల్లలు చిన్నవారు ఉన్నారు.. గురుకులాల్లో అడ్మిషన్స్ కల్పించాలని కోరారు. చదవుకున్న అమ్మాయిలు ఉన్నారు.. తమకేదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

చనిపోయిన తర్వాత పెన్షన్ రావట్లేదని తెలిపారు. అందరికీ అండగా ఉన్నాం అని. రాబోయే పదిహేను రోజుల్లో అడిగిన పనులు చేసిపెట్టే బాధ్యత తమదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 18 కోట్ల పైచిలుకు రూపాయాలను ఇన్సూరెన్స్ కడుతున్నామని చెప్పారు. 950 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జనరల్ సెక్రటరీలతో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు.
Recommended Video
అందరికి త్వరలోనే సాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనందరం ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. పది రోజుల్లోనే పిలిచి.. సమస్యలను పరిష్కారిస్తామని కేటీఆర్ తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications