TSRTC: మహిళల కోసం ప్రత్యేక బస్సు.. గండిమైసమ్మ నుంచి చార్మినార్ వరకు..
గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతోంది. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గండిమైసమ్మ నుంచి చార్మినార్ మధ్య 'లేడీస్ స్పెషల్' బస్సును ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) వెల్లడించింది. ఇందుకు సంబంధించి తెలంగాణల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఎక్స్(ట్వీట్) చేశారు. సెప్టెంబర్ 13 నుంచి గండిమైసమ్మ, జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్పేట్, లక్డీకాపూల్, గాంధీభవన్, అఫ్జల్గంజ్ల మీదుగా చార్మినార్ వెళ్తుంది.
ఈ బస్సు బుధువారం నుంచి అందుబాటులో కి వచ్చింది. ప్రతిరోజూ ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి చార్మినార్ వైపు వెళ్తుంది. సాయంత్రం 5 గంటల 20 మనిషాలకు చార్మినార్ నుంచి గండిమైసమ్మ బయల్దేరుతుంది. దీనికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సేవలు ఈ మార్గంలో అమలు చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. బస్సు నంబర్ 9ఎక్స్/272 గండిమైసమ్మ నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి గండిమైసమ్మ వెళ్తోంది. ఇది కేవలం మహిళలకే.. ఈ బస్సులో పురుషులు ఎక్కరాదు.

"మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా చార్మినార్ వెళ్తుంది. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి గండి మైసమ్మకు బయలుదేరుతుంది. ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు" అని సజ్జనార్ పేర్కొన్నారు.
మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్,… pic.twitter.com/wrOFVQHDzY
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 11, 2023
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం పలు కార్యక్రమాలు కూడా చెపపట్టింది. మొన్న రాఖీ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళు తమ టికెట్ పై ఫోన్ నంబర్ రాసి బాక్స్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించి మహిళలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నగదు బహుమతులు కూడా అందించారు. అలాగే టీ-24 టికెట్లపై మహిళాలకు రాయితీ కూడా ఇచ్చింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications