తీవ్రంగా మారిన అల్పపీడన ద్రోణి: రెండు, మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తరనం కొనసాగుతోందని వివరించింది.
దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ చత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం అనేక చోట్ల , గురువారం చాలా చోట్ల.. శుక్రవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో మేఘావృతమై ఎంది. కాసేపటి క్రితం చింతల్, కూకట్ పల్లి, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వర్షం కురిసింది.

Recommended Video
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కోమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గురువారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications