ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..
లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉన్న చోట ఉండేందుకు ప్రభుత్వాలు ఎందుకు భరోసా కల్పించడం లేదు అని ప్రశ్నించారు. పని లేక, జేబులో డబ్బుల్లేక వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. తినడానికి తిండిలేక ఆకలితో అలటిస్తున్నారని పేర్కొన్నారు.
వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురాకపోవడం శోచనీయమన్నారు. దేశంలో భారీగా ఆహార నిల్వలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటిని ఎందుకు పంచడం లేదు అని ప్రశ్నించారు. వలసకూలీ నెల గడించేందుకు సరుకులు, నగదు ఇస్తే.. వారు ఎందుకు వందల కిలోమీటర్లు నడుస్తారని ప్రశ్నించారు. అలా ఇవ్వని పక్షంలో ఆర్మీని రంగంలోకి దింపితే బాగుండేందని పేర్కొన్నారు. దీంతో కూలీల గమ్యస్థానాలకు ఇండియన్ ఆర్మీ క్షేమంగా చేరుస్తుందని తెలిపారు.

కూలీల వెతలు పట్టించుకోరు అని విపక్షాలనే తప్పుపడతారని ఉత్తమ్ ఆరోపించారు. తమ అధినేత్రి సోనియాగాంధీ పిలుపుతో.. వలస కార్మికులను తామే తరలిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే.. కూలీల తరలింపు సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. ఆర్మీ సాయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications