కేసీఆర్.. ఆంధ్రాకా, తెలంగాణకా సీఎం... నదుల అనుసంధానం కామెంట్లపై సీపీఐ రామకృష్ణ
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్పై సీపీఐ నేత కే రామకృష్ణ ఫైరయ్యారు. నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్ చేస్తున్న కామెంట్లు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎంలా కాకుండా ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్టు ప్రవర్తిసున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ పార్టీలో చేరేది బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారేనని స్పష్టంచేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి కాస్త అనుమానంగా ఉందని రామకృష్ణ అన్నారు. నదుల అనుసంధానం గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్, నీటిపారుదల శాఖ అధికారుల మాటలు కాస్త అనుమానంగా ఉందన్నారు. ఏపీ సీఎంగా కేసీఆర్ ప్రవర్తిస్తుంటే జగన్ మిన్నకుండి చూస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు 100 రోజుల్లో జగన్ పాలన పడకేసిందని విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఆ మాటే మరచిపోయారని రామకృష్ణ ఫైరయ్యారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు వారి నోటి నుంచి మాట పెకలబోదని స్పష్టంచేశారు. బీజేపీలో చేరే వారు ఆర్థిక నేరస్తులేనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. జనం మద్దతు ఉన్న నేతలేవరు ఆ పార్టీలో చేరడం లేదన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన వారే చేరుతున్నారని పేర్కొన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కాషాయ కండువా కప్పుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications