గీత దాటిన పైలట్లపై వేటు : ముగ్గురిని సస్పెండ్ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ : ఎయిర్ పోర్ట్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు పైలట్లపై విమానయాన సంస్థ వేటువేసింది. వీరిలో ఇద్దరు ప్రైవేట్ విమాన సంస్థకు చెందిన పైలట్ ఉండగా, ఒకరు ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ అని సివిల్ ఏవియేషన్ పేర్కొన్నది. వీరిని ఆర్నెల్లపాటు విధుల నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వీరితోపాటు ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు వెల్లడించింది.

అరతి గుణశేఖరన్, సౌరభ్ గులియా అనే ఇద్దరూ ఫైలట్లు విమానయాన సంస్థ నిబంధనలను అతిక్రమించారని పేర్కొంది. రన్ వే పై ఉన్న చివరి లైట్లను ధ్వసం చేశారని తెలిపింది. ఈ నెల 2వ తేదీని పుణె నుంచి కోల్ కతా వెళ్తున్న విమానం రన్ వే ఎడ్జ్ మీదికి వెళ్లిందని వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు డీజీసీఏ గుర్తుచేసింది. రన్ వే ను ధ్వంసం చేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వారిపై ఆర్నెల్లపాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుందుని వెల్లడించింది. ఆ తర్వాత వారి ప్రవర్తన ఆధారంగా సర్వీసులోకి తీసుకునే అంశాన్ని పరిగణిస్తామని సూచించింది. ముగ్గురు పైలట్లలో ప్రభుత్వ విమానయాన సంస్థ పైలట్ కూడా ఉండటం గమనార్హం. నియమ, నిబంధనలను అతిక్రమించిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని డీజీసీఏ తన చర్యలతో స్పష్టంచేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications