మహారాష్ట్రను కుదిపేసిన భూకంపం.. 12 నిమిషాల్లో నాలుగుసార్లు ప్రకపంనలు .. ఒకరి మృతి
పాల్ఘర్ : మహారాష్ట్రను భూకంపం వణికించింది. పాల్ఘర్ జిల్లాలో వరుస భూకంపాలతో జనం బెంబేలెత్తిపోయారు. అర్థరాత్రి సమయంలో 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. అర్థరాత్రి 1.03గంటల సమయంలో తొలిసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. అననంతరం మిగిలిన 12 నిమిషాల వ్యవధిలో 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడుసార్లు భూమి కంపించింది.
పాల్ఘర్లోని దహను ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నిమిషాల వ్యవధిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భారీ వర్షం పడుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. భూకంపం కారణంగా దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో 55ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

2018 నవంబర్ నుంచి పాల్ఘర్ ప్రాంతంలో వరుస ప్రకంపనలు వస్తున్నాయి. ముఖ్యంగా దుదల్వాడీ గ్రామంలో ఈ ప్రకంపనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంపం వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications