మహారాష్ట్రను కుదిపేసిన భూకంపం.. 12 నిమిషాల్లో నాలుగుసార్లు ప్రకపంనలు .. ఒకరి మృతి
పాల్ఘర్ : మహారాష్ట్రను భూకంపం వణికించింది. పాల్ఘర్ జిల్లాలో వరుస భూకంపాలతో జనం బెంబేలెత్తిపోయారు. అర్థరాత్రి సమయంలో 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. అర్థరాత్రి 1.03గంటల సమయంలో తొలిసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. అననంతరం మిగిలిన 12 నిమిషాల వ్యవధిలో 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడుసార్లు భూమి కంపించింది.
పాల్ఘర్లోని దహను ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నిమిషాల వ్యవధిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భారీ వర్షం పడుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. భూకంపం కారణంగా దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో 55ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

2018 నవంబర్ నుంచి పాల్ఘర్ ప్రాంతంలో వరుస ప్రకంపనలు వస్తున్నాయి. ముఖ్యంగా దుదల్వాడీ గ్రామంలో ఈ ప్రకంపనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంపం వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications