మణిపూర్ హింసపై మౌనమేల ? మోడీకి కాంగ్రెస్ సహా 10 విపక్ష పార్టీల లేఖ..
మణిపూర్ లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఘర్షణలు అదుపులోకి రావడం లేదు. ఇందులో వంద మందికి పైగా పౌరులు ఇప్పటికే చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. అయినా ఘర్షణలు మాత్రం తగ్గలేదు. కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించినా, ఘర్షణలపై విచారణకు ఆదేశించి దర్యాప్తు చేయిస్తున్నా ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ప్రధాని మోడీ మాత్రం మౌనం వహిస్తున్నారు.
మణిపూర్లో 110 మందికి పైగా మరణాలకు, వందలాది మంది నిర్వాసితులు కావడానికి కారణమైన హింసను అడ్డుకునే విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ 10 విపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. ఇందులో కాంగ్రెస్ తో పాటు జేడీయూ, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఉమ్మడిగా రాసిన ఈ లేఖలో పలు అంశాల్ని కేంద్రానికి గుర్తుచేశాయి.

ఈ లేఖలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ,రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం విభజించి పాలించే రాజకీయాలు మణిపూర్లో హింసను అరికట్టడంలో విఫలమయ్యాయని నిందించాయి. మణిపూర్ ముఖ్యమంత్రిని ప్రస్తుత జాతి హింసకు రూపశిల్పి అని కూడా
ఆరోపించాయి. ఆయన సకాలంలో నియంత్రణ చర్యలు తీసుకునే ఉంటే హింసను ఆపగలిగే వారన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కూడా హింస ఆగలేదని, ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని కోరాయి.
మణిపూర్ లో కాల్పులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీలు అన్ని సాయుధ సమూహాలను తక్షణమే నిరాయుధులను చేయాలని ,తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ ఐక్యత ప్రాదేశిక సమగ్రత కోసం నిలబడతాయని కుకీ తెగకు చెందిన ఇద్దరు మంత్రులతో సహా పది మంది ఎమ్మెల్యేలు కోరినట్లుగా కుకీలకు "ప్రత్యేక పరిపాలన" డిమాండ్కు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
PM Modi: గల్ఫ్ సంక్షోభం మనకు నేర్పుతున్న పాఠం-మోడీ కామెంట్స్..! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications