చిత్రకూట్ లో భక్తుల తొక్కిసలాట, 10 మంది మృతి

తొక్కసలాట ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
సోమవారం ఉదయం జరిగిన తొక్కసలాట ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఘటనలో గాయపడిన మృతుల కుటంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల నష్టపరిహారం ప్రకటించింది. రేవా రేంజ్ ఐజీ పవన్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఉదయం 5.30 ని.లకు సమాచారం అందడంతో సంఘటనాస్దలికి టీమ్స్ ని పంపి సహాయ చర్యలు చేపట్టామన్నారు.
మధ్యప్రదేశ్ లోని కమాద్గిరి కొండపై కంఠనాథ్ ఆలయం ఉంది. ప్రమాదం సంభవించిన సమయంలో 5 కి.మీ దారి పోడవు వరకూ భక్తులు వేచి ఉన్నారు. ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో శ్రీ కామనాథ్ దేవాలయం ఒకటి. పోలీసుల కథనం ప్రకారం కమాద్గిరి కొండ వెనుక ప్రాంతంలో ఆలయం ప్రాంగణంలో ఈ ఘటన జరిగిందన్నారు. గతంలో అక్టోబర్ 13, 2013న మధ్యప్రదేశ్ లోని దటియా జిల్లా రత్నగర్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది చనిపోగా, 100మందికి పైగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications