వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యూపీలో పట్టాలు తప్పిన రైలు, ప్రయాణీకుల్ని బస్సుల్లో తరలించారు
ఉత్తర ప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఉత్తప్రదేశ్లోని ఉన్నవ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఉత్తప్రదేశ్లోని ఉన్నవ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సూపర్ ఫాస్ట్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
కొందరు ప్రయాణీకులకు గాయాలయ్యాయనని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేహా పాండే చెప్పారు. రైల్వే అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ డ్యామేజ్ అయినట్లు గుర్తించారు.
రైలు నిలిచి పోవడంతో ప్రయాణీకులను బస్సులలో, ఇతర రైళ్లలో లక్నోకు తరలింాచరు. లక్నో - ముంబై నగరాల మధ్య నడుస్తోంది. పుష్పక్, లోకమాన్య ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ నగరాల మధ్య నడుస్తున్నాయి.
English summary
Eleven bogies of the Mumbai-Lucknow Lokmanya Tilak Express derailed near Unnao on Sunday afternoon but there were no fatalities.
Story first published: Sunday, May 21, 2017, 17:04 [IST]