ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు, 11మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్మోరా ప్రాంతం నుంచి నైనిటాల్ జిల్లాలోని రామ్నగర్కు వెళ్తున్న ఓ బస్సు తోటమ్ వద్దకు రాగానే అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో 11మంది దాకా మృతి చెందారు.

ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications