వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబసభ్యుల ఎదుటే 11 ఏళ్ళబాలికపై అత్యాచారం

తుపాకీని పాయింట్‌బ్లాక్‌లో పెట్టి 11 ఏళ్ళ బాలికపై తల్లి, సోదరుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గ్వాలియర్: తుపాకీని పాయింట్‌బ్లాక్‌లో పెట్టి 11 ఏళ్ళ బాలికపై తల్లి, సోదరుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో చోటుచేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలోని బిజోలీ పోలీసుస్టేషను పరిధిలోని ఓ ఇంట్లో ఓ బాలిక తన తల్లి, అన్నయ్యలతో కలిసి నిద్రిస్తోంది. అంతలో అర్దరాత్రి ఒంటిగంటకు ముగ్గురు దుండగులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.

11-Year-Old Gang-Raped As Mother And Brother Were Held At Gunpoint

ఇద్దరు వ్యక్తులు తుపాకీ గురి చూపించి చంపేస్తామని బెదిరించగా తల్లీ, అన్నయ్యల ముందే బాలికపై 36 ఏళ్ల మరో వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలికపై అత్యాచారం చేసిన జాన్వర్ సింగ్ కుష్వా (36) అనే వ్యక్తితోపాటు దీనిక సహకరించిన రాజు కుష్వా, రాంనివాస్ కుష్వాలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 డి, 450, 506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

English summary
An 11-year old girl was allegedly gang-raped at gunpoint at her home in Madhya Pradesh's Gwalior in front of her mother and teenage brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X