కుటుంబసభ్యుల ఎదుటే 11 ఏళ్ళబాలికపై అత్యాచారం
తుపాకీని పాయింట్బ్లాక్లో పెట్టి 11 ఏళ్ళ బాలికపై తల్లి, సోదరుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో చోటుచేసుకొంది.
గ్వాలియర్: తుపాకీని పాయింట్బ్లాక్లో పెట్టి 11 ఏళ్ళ బాలికపై తల్లి, సోదరుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో చోటుచేసుకొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలోని బిజోలీ పోలీసుస్టేషను పరిధిలోని ఓ ఇంట్లో ఓ బాలిక తన తల్లి, అన్నయ్యలతో కలిసి నిద్రిస్తోంది. అంతలో అర్దరాత్రి ఒంటిగంటకు ముగ్గురు దుండగులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
ఇద్దరు వ్యక్తులు తుపాకీ గురి చూపించి చంపేస్తామని బెదిరించగా తల్లీ, అన్నయ్యల ముందే బాలికపై 36 ఏళ్ల మరో వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలికపై అత్యాచారం చేసిన జాన్వర్ సింగ్ కుష్వా (36) అనే వ్యక్తితోపాటు దీనిక సహకరించిన రాజు కుష్వా, రాంనివాస్ కుష్వాలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 డి, 450, 506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.