బలవంతంగా వ్యభిచార కూపంలోకి: నలుగురు అరెస్ట్
ముంబై: మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కళ్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలో వ్యభిచారం జరుగుతుందోని స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన థానే క్రైం బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు.
ఈ ఘటనలో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా థానే క్రైం బ్రాంచ్ అధికారి షకీల్ షేక్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులపై దాడిచేసి మహిళలను రక్షించామన్నారు.

20 నుంచి 25 ఏళ్ల యువతులతో బలవంతంగా ఈ వృత్తి చేయిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశామన్నారు. క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలను కాపాడి, రిమాండ్ హోంకు తరలించామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందని చెప్పారు.
ఆరోపణలను ఎదుర్కొంటున్న మహిళలను లక్ష్మీ (అమ్మ), పరమేశ్వర్ పాటిల్ (39), రాధా విజయ్ కొనపాక్కులా (46), రజియా అబ్ధుల్ కరీం షేఖ్ (48), లలితా బాల్య నాయక్ (35)గా గుర్తించారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications