127 మందిపై సామూహిక అత్యాచారం, లూటీలు
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు.
ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను గురువారం డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్చంద సంస్థ వెలుగులోకి తీసుకు వచ్చింది.
మే 1వ తేది జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్ లో ఆర్మీ మిలిషియా సభ్యులు ఇండ్ల మీద దాడులు చేశారు. తరువాత ఇండ్లలోని విలువైన వస్తువులు లూటీ చేశారు. మహిళలను బయటకు లాగేశారు.

చిన్నా పెద్ద తేడా లేకుండ వరసపెట్టి గ్యాంగ్ రేప్ లు చేశారు. సుమారు 127 మంది మీద అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన వారిలో 14 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఉన్నారని స్వచ్చంద సంస్థ వెల్లడించింది.
అత్యాచారాలకు గురైన వారు ఫిర్యాదులు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని, అయితే వైద్యం అందించాలని ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అందరికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గత 20 సంవత్సరాల నుండి ఆర్మీ మిలిషియా సభ్యుల దురాగతాలకు అడ్డు అదుపు లేకుండ పోతున్నది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications