బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. నుజ్జునుజ్జయిన కార్లు..

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూమకూరు జిల్లా కొణిగల్ సమీపంలోని బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళ్తున్న ఓ బ్రీజా కారు.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం.. కారు పల్టీలు కొడుతూ వెళ్లి ఎదురుగా వస్తున్న చెవర్‌లెట్ కారును ఢీకొట్టింది. బ్రీజా కారులో ఉన్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. చెవర్‌లెట్ ఉన్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Recommended Video

Karnataka Minister Sriramulu Daughter Rakshitha Wedding Video | అబ్బురపరిచిన పెళ్లి ఏర్పాట్లు!

ప్రమాద సమయంలో ఒక కారులో 10 మంది మరో కారులో 12 మంది ఉన్నట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.మృతుల కుటుంబాల సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.

English summary
At least 13 persons, including women and children, were killed and five critically wounded when an SUV collided with a car that had crashed against a road divider moments ago near Kunigal in Tumakuru district of Karnataka in the early hours of Friday, police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X