మత ఘర్షణలు: ముగ్గురు సజీవ దహనం, 14 మంది అరెస్టు

పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్లు ముజఫర్‌పూర్‌ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. పరిస్ధితి అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

వివరాల్లోకి వెళితే ఓ వర్గానికి చెందిన యువతి... మరో వర్గానికి చెందిన యువకుడితో లేచిపోయింది. ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దాంతో ఆగ్రహించిన మృతుని బంధువులు, గ్రామస్తులు అజీజ్‌పూర్‌పై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టి... పలు వాహనాలను ధ్వంసం చేశారు.

14 arrested for arson in Bihar's Muzaffarpur after 3 people killed in clashes

ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులను మోహరించారు. ఈ మత ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు జిల్లా అధికారులు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, కాలిబూడిదైన ఇళ్లకు రూ. లక్ష, సుమారు 20 ఇళ్లలో నివసిస్తున్న 57 కుటుంబాలకు... ఒక్కో కుటుంబానికి రూ. 42,000వేలు ప్రకటించారు. ఈ ఘర్షణల్లో ఇళ్లు కొల్పోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఘర్షణలపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ దర్యాప్తుకు ఆదేశించారు. ఇద్దరు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందానికి ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సుధీక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+