లోయలో పడ్డ బస్సు: 15 మంది మృత్యువాత
అల్మోరా: ఉత్తరాఖండ్ పర్యాటక ప్రాంతం అల్మోరా పర్వత శ్రేణుల్లో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ నుంచి ఫితోరాగఢ్కు వెళుతోన్న ఓ బస్సు లోయలోకి పడింది.
ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
UPDATE:14
killed
&
22
injured
after
bus
(Delhi
to
Pithoragarh
)fell
into
a
gorge
at
Vill
Thyadi
in
Dania,
Almora(UK)
pic.twitter.com/oFSjmS8JjV
—
ANI
(@ANI_news)
June
20,
2015
చికిత్స పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మితి మీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.