వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో పడ్డ బస్సు: 15 మంది మృత్యువాత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అల్మోరా: ఉత్తరాఖండ్ పర్యాటక ప్రాంతం అల్మోరా పర్వత శ్రేణుల్లో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ నుంచి ఫితోరాగఢ్‌కు వెళుతోన్న ఓ బస్సు లోయలోకి పడింది.

ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మితి మీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
At least 15 people have died and 14 others are injured after a bus plunged 500 metres into a gorge in Uttarakhand's Almora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X