జై శ్రీరాం అనకుంటే ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు
చందౌలి : హిందుత్వం పేరుతో దాడులు పెరిగుతున్నాయి. ముఖ్యంగా యూపీలో హిందుత్వ వాదులు రెచ్చిపోతున్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని బెదిరిస్తున్నారు. అలా అనకుంటే దాడులు చేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా కొట్టడంతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని చందౌలిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ ముస్లిం యువకుడిపై నలుగురు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు భిన్న వాదనలే చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
యూపీలోని చందౌలి జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల ముస్లిం యువకుడిని నలుగురు యువకులు అడ్డుకున్నారు. అతనిని ఆటకాయించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేశారు. అయితే ఇందుకు ఆ యువకుడు నిరాకరించాడు. ఇంకేముంది తమ ప్రతాపం చూపారు. అతనిని పట్టుకొని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మంటలతో హహకారాలు చేస్తూ ఎలాగోలా ఇంటికి చేరిపోయాడు. అతడిని కాశి కబీర్ చౌరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువకుడి ఒంటిపై 60 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.

యువకుడి ఆరోపణలు ఇలా ఉంటే పోలీసులు తీరు మాత్రం విచిత్రంగా ఉంది. జరిగిన ఘటన ఇదీ కాదని వారు చెప్తున్నారు. యువకుడు డుదారి బ్రిడ్జి వద్ద నలుగురు కిడ్నాప్ చేశారని మీడియాకు తెలిపారని వివరించారు. అందులో ఇద్దరు అతని చేతులను కట్టేశారని పేర్కొన్నారు. మరొకరు కిరోసిన్ పోసి నిప్పంటించారని .. అక్కడినుంచి పరుగెత్తి ఇంటికొచ్చాడని తెలిపారు. అయితే అతని ఇంటికి వచ్చేసరికి కూడా మంటలతో యువకుడు కాలిపోతున్నాడని చెప్పారు. అయితే యువకుడు, పోలీసుల వాదన విచిత్రంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications