ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతి
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అనారోగ్యంతో మరణించాడని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ లోని కారాచిలో నిందితుడు యాకూబ్ ఖాన్ అలియాస్ యెద్ యాకూబ్ ఆసుపత్రిలో మరణించాడని అధికారులు తెలిపారు.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితులలో యాకూబ్ ఖాన్ ఒకడు. 1993లో యాకూబ్ ఖాన్ అతని సోదరుడు మజీద్ లు టైగర్ మెమెన్ తో కలిసి ముంబైలో వరస బాంబు పేలుళ్లలో కీలకపాత్ర పోషించారని వెలుగు చూసింది.
ఆర్డీఎక్స్ లు ముంబై నగరం నుండి ఇతర ప్రాంతాలకు తరలించడంలో యాకూబ్ ఖాన్ సిద్దహస్తుడు. ముంబై బాంబు పేలుళ్ల తరువాత టైగర్ మెమెన్ తో కలిసి యాకూబ్ ఖాన్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్ పారిపోయాడని అధికారులు తెలిపారు.

యాకూబ్ ఖాన్ ఇటివల అనారోగ్యానికి గురైనాడు. బుధవారం గుండె పోటు రావడంతో అతని కుటుంబ సభ్యులు కరాచిలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స విఫలమై అతను మరణించాడని భారత్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
అయితే పాక్ అధికారులు మాత్రం యాకూబ్ ఖాన్ గురించి మాకు తెలీదు అంటున్నారు. ఆ విషయంపై ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్పందించారు. యాకూబ్ ఖాన్ మరణించాడని మీడియాలో చూస్తున్నామని, అధికారికంగా మాకు తెలియలేదని ఆయన అంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications