మంచు వర్షంలో... కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఇద్దరు టెర్రరిస్ట్లు హతం: కొనసాగుతున్న ఆపరేషన్
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బుద్గాంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంచు వర్షంలో తీవ్రవాదులతో భద్రతాదళాలు పోరాటం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఓ వైపు గడ్డగట్టే చలి, మరోవైపు వర్షంలు కురుస్తున్న మంచులోనే ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు సిద్ధమయ్యాయి.
శీతాకాలం కావడంతో కాశ్మీర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయింది. అటవీ ప్రాంతంలో మంచు మరింత ఎక్కువగా కురుస్తోంది. బుద్గాంలో ఈ వారం రోజుల్లో ఇది మూడో ఎన్కౌంటర్.

టెర్రరిస్టులు బుద్గాంలోని ఓ ఇంట్లో నక్కి ఉన్నారు. ఇందులో ఇద్దరిని చంపేశారు. బుద్గాం పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications