ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ ఎక్కువవుతున్నాయి. పక్కా సమాచారంతో భద్రతా దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ బలగాలకు- ఉగ్రవాదులకు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అనంత్ నాగ్లో ఉగ్రవాదులు- భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్కు అనుబంధంగా ఉన్నారని గుర్తించారు.
ఇద్దరు ఉగ్రవాదులు కార్యకలాపాలకు పాల్పడ్డారని కశ్మీర్ ఐజీ వివరించారు. ఆయుధాలు, అమ్మోనియా.. ఇతర పదార్థాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇష్పాక్ అహా ఘనీ, యావర్ ఆయూబ్ దార్ అని గుర్తించారు. అనంత్ నాగ్లో గల బ్రిబెహరా, సందిపొరలో ఎన్ కౌంటర్ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది.
ఇటీవల కశ్మీర్లో చొరబాటులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎరి పారేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం కూడా ఎన్ కౌంటర్ జరిగింది.