ఉగ్ర ఏరివేతలో ఆర్మీ దూకుడు: మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్లో ఉగ్ర ఏరివేతలో భారత సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం తెల్లవారుజామున సోపోర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర ఏరివేతలో భారత సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం తెల్లవారుజామున సోపోర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు నతీపోరాలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం తెల్లవారుజామున 2.45గంటల సమయం) మొదలుపెట్టిన ఎదురుకాల్పులు ఉదయం వరకు కొనసాగాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి 2 ఏకే47 రైఫిల్స్, 107 రౌండ్ల తూటాలు, రెండు పౌచ్లు, రూ.2వేల నగదు, రెండు రబ్బర్ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు.

బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కారణంగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టగలుగుతోంది. ఇటీవల సబ్జార్ భట్ ఎన్ కౌంటర్లో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సహకరించింది. కొంతమంది స్థానికులు సైనికులకు అండగా నిలవడం వల్ల కూడా ఉగ్ర ఏరివేత కొంత వరకు తేలిగ్గా మారుతోందని భద్రతాదళ అధికారులు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications