ప్రియుడికి నిప్పంటించిన ప్రియురాలు ! యూపిలో రివర్స్
ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు మైనర్ల మధ్య ప్రేమ వ్యవహారం ఓ యువకున్ని బలి తీసుకుంది. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని వేధించే యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. ప్రియురాలిని బెదిరించడానికి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకునికి, ప్రియురాలు నిజంగానే నిప్పటించింది. దీంతో యువకుడు ఆసుపత్రిపాలు కాగా యువతి కటకటాలపాలైంది.
యూపిలో రోటిన్ కు భిన్నంగా....
సాధరణంగా ప్రేమించిన యువకుడు తనను పెళ్లి చేసుకోకపోతే ప్రియురాలిపై ఆసిడ్ ,పెట్రోల్ ,కిరోసిన్ పోసి హత్యాయత్నం చేస్తాడు. తనకు దక్కనిది మరేవరికి దక్కకూడదంటూ దుర్మార్గానికి ఒడిగడతాడు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర్రాల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటీ ఆకృత్యాలు నార్త్ ఇండియాలోనైతే మరి ఎక్కువగా జరుగుతుంటాయి. ఉత్తర ప్రదేశ్ లో మాత్రం రోటీన్ కు భిన్నంగా జరిగింది. ప్రియుడి ప్లేస్ లో ప్రియురాలు చేరింది. నన్నే వేధిస్తావా అంటూ నిప్పు పెట్టింది
ప్రేమించిన యువతితో పెళ్లి చేయమని పెట్రోల్ పోసుకున్న యువకుడు
యూపిలోని ఖాద్రా ప్రాంతానికి చెందిన అరవింద్ నిషాద్ (20 )అనే యువకుడు తమ ఇంటి పక్కన ఉండే ,9 వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇదే విషయాన్ని ఆ యువకుడు అమ్మాయి తల్లిదండ్రులకు కూడ చెప్పాడు. అమే 9 తరగతి చదుతుండడంతో తోపాటు మైనర్ కావడంతో మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. అయినా నిషాద్ ఆగలేదు. మరోసారి బాలిక తల్లితో పాటు నిషాద్ ఇంటికి వెళ్లింది. మళ్లి ఓసారి ఇదే చర్చ జరగడంతో ఆవేశంలో ఉన్న నిషాద్ వారిని బెదిరించేందుకు గాను వారి ముందే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
పెట్రోల్ పోసుకున్న ప్రియుడికి స్వయంగా నిప్పు పెట్టిన ప్రియురాలు
విచిత్రం ఏమిటంటే నిషాద్ పెట్రోల్ పోసుకోవడంతో దాన్ని ఆపాల్సిన యువతి కాని ,ఆమే తల్లి గాని ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా వేధింపులకు ఫుల్స్టాప్ పెట్టేందుకు యువతి వెంటనే అగ్గిపుల్ల గీసీ అతని మీద వేసింది. అసలే పెట్రోల్ ,ఒక్కసారిగా భగ్గుమని అంటుకుంది .నిషాద్ శరీరం సుమారు అరవై శాతం కాలిపోయింది. వెంటనే నిషాద్ ను దగ్గరలోని ఆసుపత్రికి అతని తల్లి, చుట్టుపక్కల గ్రామస్థులు కలిసి తరలించారు. కాగా నిషాద్ తల్లిదండ్రులు కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.