200కోట్ల స్కాం: పంకజముండే కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
ముంబై: మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే మీద ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఒక మహిళ మంత్రిగా ఉంటూ రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. చిన్న పిల్లలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారని అంటున్నారు.
మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యాభ్యాసం చేస్తున్న గిరిజన విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చెయ్యడానికి నిధులు మంజూరు చేశారు. పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి నియమాలు పాటించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

మహారాష్ట్రలో ఇది ఒక పెద్ద కుంభకోణం అని మండిపడింది. అక్రమంగా ఆన్ లైన్ టెండర్లు పిలిచి, వారికి కావలసిన వారితో ఆ వస్తువులు కొనుగోలు చెయ్యడం వలన మంత్రి పంకజ ముండేకి రూ.200 కోట్ల ముడుపులు ముట్టాయని, మా దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయని, వాటిని బయటపెడుతామని కాంగ్రెస్ ఆంటోంది.
అయితే రూ.ఒక లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఏవైనా వస్తువులు కొనుగోలు చెయ్యాలంటే టెండర్లు పిలవాలని తాము గతంలోనే ఆదేశాలు జారీ చేశామని మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్ అంటున్నారు. ఈ విషయంపై మంత్రి పంకజ ముండే స్పందించవలసి ఉంది. బీజేపీ అగ్రనేతగా ఒక వెలుగు వెలిగిన దివంగత గోపినాథ్ ముండే కుమార్తె పంకజ ముండే.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications