వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండచరియలు పడి 25మంది మృతి, శిథిలాల కింద..

By Srinivas
|
Google Oneindia TeluguNews

200 feared trapped in Ambegaon tehsil landslide
ముంబై: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పుణే సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. దాదాపు నూటా యాభై మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బుధవారం సాయంత్రం వరకు పది శవాలను శిథిలాల నుంచి వెలికి తీశారు.

శిథిలాలకింద అనేకమంది చిక్కుకున్నట్లు తెలియవచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. బుధవారం పుణె సమీపంలోని అంబెగాన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అంబేగాన్ తెహిసిల్‌లోని మాలిన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. కొండ చరియలు విరగడంతో పెద్దపెద్ద రాళ్లు కిందకు పడ్డాయన్నారు.

English summary
Nearly 200 people are feared to have been trapped when a massive secton of a hillock came crashing down on a village of around 40 homes near Pune early Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X